పెద్దపల్లి : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు రామగుండం ప్రాంతంలో 100 మందికి పైగా బొగ్గుగని కార్మికులకు ఆదివారం వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారు. గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో రామగుండం-1 ఏరియా కోల్ మైనర్స్కి వ్యాక్సినేషన్ నిర్వహించారు. 45 ఏళ్లు పైబడిన 100 మంది ఉద్యోగులకు కొవాగ్జిన్ మొదటి డోస్ ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మైనర్లకు కౌన్సెలింగ్ నిర్వహించింది. టీకాతో పాటు సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్లు ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ -1 జనరల్ మేనేజర్ లాల్వాలా నారాయణ, అసిస్టెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బి. వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.