గోదావరిఖని: రామగుండం ప్రజల ప్రాణదాత సీఎం కేసీఆర్ అని, తాము కోరిన వెంటనే నియోజకవర్గానికి మెడికల్ కళాశాలను మంజూరు చేసి రామగుండం ప్రజలు, సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నం సాకారం చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల రుణం తీర్చుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
శుక్రవారం ఆయన హైదరాబాద్లోని ప్రగతిభవన్లో జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ను కలిసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్యాబినెట్ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన చర్చలో ప్రధానంగా మెడికల్ కళాశాల పనులను వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది తరగతులను నిర్వహించాలని ఆరోగ్యశాఖకు, ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమన్నారు.