పెద్దపల్లికమాన్, మార్చి 16: సీనియర్ జాతీయస్థాయి క్రీడా పోటీలకు గాయత్రి డిగ్రీ కళాశాల విద్యార్థి బాలసాని శ్రీకాంత్ ఎంపికయ్యాడు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ దాకా భరత్పూర్, రాజస్థాన్లో నిర్వహించనున్న సీనియర్ జాతీయస్థాయి సాఫ్ట్బాల్ క్రీడా పోటీల్లో శ్రీకాంత్ పాల్గొననుండడంతో కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రవీందర్, సిబ్బంది మంగళవారం అభినందించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.