ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి
పెద్దపల్లి జంక్షన్, మార్చి 16: బీసీలు సంఘటితమై రాజ్యాధికారం సాధించే దిశగా పోరాడాలని ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరికిపండ్ల నరహరి సూచించారు. మం గళవారం పట్టణంలోని అమర్చంద్ కల్యాణ మండలంలో ‘సంఘటితం, అధికారం, సమానత్వం’ అనే పేరుతో జన అధికారి సమితి ఆధ్వర్యంలో నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ సదస్సు నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీల మేధోమథన కార్యాచరణ వేదిక ద్వారా ఐక్య ఉద్యమా లు చేస్తే బీసీలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీలు బీసీలను పావులుగా వాడుకొని, అధికారంలోకి రాగానే బీసీ ల హక్కులను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సులో జడ్పీటీసీ గంట రాములు, మారం తిరుపతి, పెగడ రమేశ్, నెల్లి సంపత్, తదితరులు పాల్గొన్నారు.