పెద్దపల్లి రూరల్, మార్చి 16: వైకుంఠధామాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. పెద్దపల్లి మండలం సబ్బితంలో నిర్మించిన వైకుంఠధామాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పను లు పూర్తికావడంపై సంబంధిత అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులను అభినందించారు. ఇక్కడ ఏపీడీ రాజు, ఎంపీవో సుదర్శన్, సర్పంచ్ చుంచు సదయ్య అధికారులు, సిబ్బంది ఉన్నారు