కనువిందు చేస్తున్న పల్లె పకృతి వనాలు
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు,చిన్నారులు
చిగురుమామిడి, జూన్ 12: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి పనుల్లో భాగంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు ఏపుగా పెరిగి గ్రామస్తులకు కనువిందు చేస్తున్నాయి. మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ప్రశాంతమైన వాతావరణం, అందమైన పూల మొకలను చూసిన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చిగురుమామిడి, లంబాడిపల్లె, రేకొండ తదితర గ్రామాల్లోని పల్లెప్రకృతి వనాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో వృద్ధులు, చిన్నారులు సేదదీరుతున్నారు. చిన్నారులు క్రీడా వస్తులతో ఆటలు ఆడుకుంటున్నారు. రకరకాల పూల మొకలు కనువిందు చేస్తున్నాయి.
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు నిత్యం పల్లె ప్రకృతి వనాల్లో గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా మొకలకు నీళ్లు పోస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వన సంరక్షణ కూలీలు పల్లె ప్రకృతి వనాల వద్ద ఉంటున్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి.