కోల్సిటీ, ఏప్రిల్ 1: రామగుండం నగర పాలక సంస్థ ఉద్యోగులను మేయర్ అనిల్కుమార్, కమిషనర్ పీ ఉదయ్ కుమార్ అభినందించారు. 2020-21 గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యంలో 95.03 శాతం సాధించడంతో నగర పాలక సంస్థ కార్యాలయం లో గురువారం వేర్వేరుగా ఆయా శాఖల అధికారులను అభినందించి స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ నారాయణరావు, ఆర్వో రాములు, ఆర్ఐలు శంకర్ రావు, మనోహర్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిశోర్ ఉన్నారు.
పెద్దపల్లిలో 99 శాతం పన్ను వసూలు
పెద్దపల్లి జంక్షన్, ఏప్రిల్ 1: పెద్దపల్లి బల్దియా పరిధిలో 99 శాతం ఆస్తి వసూలు చేశామని మున్సిపల్ కమిషనర్ సీహెచ్ తిరుపతి తెలిపారు. మార్చి 31దాకా రెసిడెన్షియల్ 98. 81, నాన్ రెసిడెన్షియల్ 99.28 శాతం ఆస్తి పన్ను వసూలైందని వెల్లడించారు. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తి పన్ను దాదాపు 50 శాతం మాత్రమే వసూలు అయిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చుడండి
కిడ్నీ స్టోన్లు ఉన్నాయని తెలిపే లక్షణాలు ఇవే..!