జూలపల్లి, ఏప్రిల్ 1: బాలరాజ్పల్లికి చెందిన బీజేపీ మండల నాయకుడు అట్ల లస్మయ్య బెదిరింపులు, మోసానికి రేశవేని రమేశ్ (25)ఆత్మహత్య చేసుకున్నాడంటూ బాధిత కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు గురువారం మృతదేహంతో ధర్నా చేశారు. లస్మయ్య ఇంటి ఆవరణలోనికి రమేశ్ మృతదేహాన్ని తరలించి బైఠాయించారు. మృతుడి భార్య, ఇద్దరు చిన్న పిల్లల్ని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, జూలపల్లి ఎస్ఐ చంద్రకుమార్, పోలీసులు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. గ్రా మస్తులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కరీంనగర్లో రమేశ్ దాదాపు మూడేండ్ల నుంచి లస్మయ్య వద్ద భవన నిర్మాణ రంగంలో సూపర్ వైజర్గా పని చేస్తున్నాడు. లస్మయ్య తన రియల్ ఎస్టేట్ రంగంలో భాగస్వామ్యం ఇస్తాననగా, రమేశ్ దాదాపు రూ. 30 లక్షల దాకా ఇచ్చాడు. కొన్ని నెలల నుంచి డబ్బులు ఇవ్వాలని అడిగితే రేపు, మాపు అంటూ వాయిదాలు పెడుతూ బెదిరింపులకు గురి చేశాడు. డబ్బులు అడిగితే చంపు తామని లస్మయ్యతోపాటు అతడి భార్య శంకరమ్మ, కొడుకులు శ్రీకాంత్, శ్రీనివాస్ బెదిరించారు. మనస్తాపానికి గురై రమేశ్ బాలరాజ్పల్లిలోని తన ఇంట్లో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, మూడు నెలల బిడ్డ, 14 నెలల కొడుకు ఉన్నాడు. రమేశ్ తమ్ముడు సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నలుగురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విరాళాలు సేకరించి అంత్యక్రియలు
చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో రమేశ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు ముందు కు వచ్చారు. ఈ క్రమంలో తలాకొంత వేసుకున్నారు. దాదాపు రూ. 30 వేల దాకా సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు.
నాయకుడిని శిక్షించాలి
బీజేపీ మండల నాయకుడు అట్ల లస్మయ్యను వెంటనే శిక్షించాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శాతళ్ల కాంతయ్య, ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు దండె వెంకటేశం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం వారు మాట్లాడుతూ, లస్మయ్య బెదిరింపులు, మోసాలకు గురై రేశవేని రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉప సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు అడువాల తిరుపతి, పసునూటి శ్రీనివాస్, గాండ్ల చంద్రయ్య, ప్రసాద్, రేశవేని సతీశ్, చిప్ప శంకరయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.