మంథని రూరల్ : విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కామెర మల్లమ్మ (65) అనే మహిళ బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.
ఇదే ఘటనలో వేముల కమలమ్మ గాయపడటంతో గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ రెండు సంఘటనలు జరిగాయని సర్పంచ్ నరేష్ రావు, గ్రామస్తులు ఆరోపించారు.