పెద్దపల్లి : సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని 79 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
దీనిని నిరుపేదలు సద్వినయోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బండారి శ్రీనివాస్, అక్క పాక తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.