పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా పారకూలర్తి మండలం మారేడుపల్లి గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ పాఠశాలలో దాతలు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన అదనపు తరగతులను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ధర్మారం గ్రామంలో రూ.12 లక్షలతో చెత్త సేకరణకు మంజూరైన ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పాలకుర్తి ఎంపీపీ వ్యాల్ల అనసూర్య రాంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, మారేడుపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ , టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, సంజీవ్ ఇతరులు పాల్గొన్నారు.