మంథని టౌన్: జాతీయస్థాయి కరాటే పోటీలకు మంథనికి చెందిన షోటోకాన్ కరాటే విద్యార్థి
ఎంపికయ్యారు. హైదరాబాద్లో కియో(కరాటే ఇండియా ఆర్గనైజేషన్) సీనియర్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను నిర్వహించగా ఇందులో మంథని షోటోకాన్ కరాటే విద్యార్థి బాబివర్మ 55 కిలోల స్పారింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడంతోపాటు జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 3, 4 తేదీల్లో డెహ్రాడూన్(ఉత్తరఖండ్)లో జరుగనున్న జాతీయస్థాయి కియో పోటీల్లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా బాబివర్మ, ఇన్స్ట్రక్టర్ కొండ్ర నాగరాజులను సీనియర్ ఇన్స్ట్రక్టర్ నూకల బానయ్య, సీనియర్ కరాటే మాస్టర్లు బక్కయ్య, శంకర్గౌడ్ అభినందించారు.