కోల్సిటీ : మలిదశ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం పరితపించిన మహనీయుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మంచికట్ల దయాకర్, బాలరాజ్కుమార్, పద్మశాలీ సేవా సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి అందె సదానందం, గౌరవ అధ్యక్షుడు మండల సత్యనారాయణ, అధ్యక్షులు చిప్ప రాజేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట లక్ష్మీనర్సయ్య, ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్, కొండా సంపత్, నూతి తిరుపతి, అనుముల కళావతి, చిప్ప రజిత, మాటేటి శంకర్, అడిచర్ల నంబయ్య, శ్రీనివాస్, రాజేశ్వరరావు, మహేందర్, సత్యం, ప్రభాకర్, సాంబమూర్తి, వంగ వీరస్వామి, లక్ష్మీపతి, గజెల్లి వెంకటేశ్వర్లు, మాటేటి శ్రీనివాస్, వడ్డెపల్లి దినేశ్, జడల సంపత్, గోలి శ్రీనివాస్, టం రాజేశం తదితరులున్నారు.