పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖనిలో లారీ యార్డు నీట మునిగింది. గోదావరిలో వరద ఉధృతి కారణంగా అధికారులు శ్రీపాద ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేశారు. దీంతో గోదావరిఖనిలోని గంగనగర్ వద్ద ఉన్న లారీ యార్డులో నీరు చేరింది. పలు లారీలు నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. అదే ప్రాంతంలో ఇటుకలు తయారు చేస్తున్న 40 మంది వరదలో చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకరావడానికి అధికారులు చర్యలు తీసకుంటున్నారు. మరోవైపు మేడిపల్లి ఓసీపీ రోడ్డు నీట మునిగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.