పెద్దపల్లి : తెలుగు కథకు, తెలంగాణ భాషకు వన్నె తెచ్చిన డా. కాలువ మల్లయ్య సప్తది సందర్భంగా కరీంనగర్కు చెందిన సాహితీ సోపతి సంస్థ వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వారికి స్ఫూర్తి, ప్రతిభా పురస్కారాలను అందజేసింది.
అందులో భాగంగా కోల్బెల్ట్ ప్రాంతంలో వసుంధర విజ్ఞాన వికాస మండలి వ్యవస్థాపకులుగా, కథా రచయితగా, కవిగా గుర్తింపు పొందిన సీనియర్ జర్నలిస్ట్ మధుకర్ వైద్యులను కాలువ మల్లయ్య స్ఫూర్తి పురస్కారం వరించింది.