పెద్దపల్లి : స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. సోమవారం రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ సందర్శనకు వచ్చి కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి ఎంఓఎస్ భగవంత్ కూబాను ఎంపీ కోరారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్టర్స్కి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్లాంట్ లో సాంకేతిక లోపాలను సవరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
స్థానికంగా భూములు కోల్పోయినటువంటి బాధితులకు కుటుంబాలలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.