పెద్దపల్లి: జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు పెద్దపల్లి పోలీసులు. గత కొద్దికాలంగా జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను శనివారం తమ ఆదీనంలోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.18 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి సీపీ సత్యనారాయణ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎవరూ లేని ఇళ్లే లక్ష్యంగా చేసుకుని ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు.