పెద్దపల్లి : సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ పటిష్టతకు నిరంతరం పాటుపడాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన రామగుండం శాసన సభ్యుడు కోరుకంటి చందర్కు మంత్రి పుష్పం గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన టీఆర్ఎస్పై ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తూ పార్టీని విస్తరించాలన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన ఉద్యమ కారులకే కేసీఆర్ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం మేయర్ అనిల్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి ఉన్నారు.