పెద్దపల్లి వ్యవసాయశాఖ సాంకేతిక విభాగం సహాయ సంచాలకుడు కాంతారావు
పెద్దపల్లి రూరల్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యాసంగిలో రైతులు పంట మార్పిడి చేస్తూ, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ సూచనల మేరకు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని పెద్దపల్లి వ్యవసాయశాఖ సాంకేతిక విభాగం సహాయ సంచాలకుడు కాంతారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని చీకురాయి, పాలితం, రాంపల్లి, అప్పన్నపేట, రాంపల్లి, సబ్బితం క్లస్టర్ల రైతువేదికల్లో శుక్రవారం రైతులకు యాసంగి పంటల సాగు ప్రణాళికలపై అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ సందర్భంగా చీకురాయి, పాలితం సదస్సుల్లో ఏడీఏ కాంతారావు, ఎంఏవో అలివేణి మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరిస్తూ అధిక లాభాలు పొందాలన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి సింగిల్విండో చైర్మన్ మదిరెడ్డి నర్సింహారెడ్డి, ఏఈవోలు వినయ్కుమార్, శిరీష, సుష్మశ్రీ, అర్చన, శ్వేతలతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, కో-ఆర్డినేటర్లు, రైతులు పాల్గొన్నారు.