కాల్వశ్రీరాంపూర్ : టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మీర్జంపేట గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి పార్టీ పటిష్టత, తదితర అంశాలపై చర్చించారు. అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించినట్లు మాజీ ఎంపీటీసీ సదానందం తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టీఆర్ఎస్ నాయకులు పుల్లూరి సాగర్, గోపు చంద్రశేఖర్, రామిడి సమ్మిరెడ్డి, పుప్పాల రవి, ఉయ్యాల రవీందర్, ఉల్లి మల్లేశ్, పంజాల చమన్, పుల్లూరి రాజు, పుల్లూరి కనకరాజ్, సిరికొండ సతీశ్ ఉన్నారు.