పెద్దపల్లి : మంథనిలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనానికి, కుంకుమ పూజలు చేసుకునేందుకు పిల్లా పాపలతో కలిసి భక్తులు దేవాలయానికి పోటెత్తుతున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారిని విశేషంగా స్వర్ణాభరణాలు రకరకాల పుష్పా మాలికలతో సర్వాంగసుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
మంథని ప్రాంతం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వచ్చి కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు తమ సౌభాగ్యం కోసం మహాలక్ష్మి అమ్మవారి కి ప్రత్యేకంగా ఒడిబియ్యం, పసుపు కుంకుమలను, పట్టు వస్త్రాలను సమర్పించారు.