పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతాసత్యనారాయణ
పెద్దపల్లి జంక్షన్: జిల్లాలోని అర్హులందరికీ కొవిడ్ -19 వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతాసత్యనారాయణ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. 10 రోజుల్లో అందరికీ కొవిడ్ టీకా వేసేందుకు జిల్లావ్యాప్తంగా 218 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి కేంద్రంలో కనీసం 100 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ తిరుపతి, వైద్య, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.