సుల్తానాబాద్ : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు వరంలాంటిదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సుల్తానాబాద్లోని మండల పరిషత్ కార్యాలయంలో 54 మంది లబ్ధిదారులకు రూ. 54,31,293 విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతారమేశ్, సింగిల్విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర శ్రీనివాస్గౌడ్, ఎంపీడీవో శశికళ, తహసీల్దార్ పాల్సింగ్, వైస్ ఎంపీపీ కొట రాంరెడ్డి, అశోక్రెడ్డి, సందీప్రావు, మహిపాల్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.