పెద్దపల్లి : జిల్లాలోని కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఆదివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి , టీఆర్ఎస్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి బస్వరాజు సారయ్య, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ సంస్థాగత ఎన్నికలతో టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.