రామగిరి : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ సోమవారం రామగిరి మండల రజక సంఘం నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల అధ్యక్షుడు ధర్ముల రాజయ్య, జిల్లా కో-ఆర్డినేటర్ నాగెల్లి సాంబయ్య మాట్లాడుతూ రజకులకు సముచిత గౌరవాన్ని ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కొత్తపల్లి రాజమల్లు, కంది కృష్ణయ్య, పున్నం సమ్మయ్య, బండి ఓదెలు, మల్లేశ్, లింగయ్య, రాములు, రవి, పెనుగొండ రాజ్కుమార్, శ్రీకాంత్, సాయికుమార్, కల్యాణ్ ఉన్నారు.