పెద్దపల్లి కమాన్, జూలై 24: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీకోదండరా మాలయం ఆవరణలోని శ్రీషిర్డీ సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను శనివారం నిర్వహించారు. ఆలయ అర్చకు డు జంబోజు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు.
రామగిరి, జూలై 24 : సెంటినరీకాలనీలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో ఆలయ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, మాజీ చైర్మన్ అనిల్ కుమార్, ఆలయ ప్రతినిధి బృందం గంట వెంకటరమణారెడ్డి, రాంచందర్రావు, బీరువాల రవీందర్, కాటం సత్యం, కాపురబోయిన భాస్కర్ పాల్గొన్నారు.
ఓదెల, జూలై 24: కొలనూర్ వేణుగోపాలస్వామి ఆలయంలో వేదపండితుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ప్రతాపురం రామాచారి దంపతులను శాలువాతో సన్మానించారు. గురువు కాళ్లకు దండం పెట్టి పలువురు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు యాంసాని క్రిష్ణమూర్తి
ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో సర్పంచ్ సామ మణెమ్మ, ఉప సర్పంచ్ పాకాల సంపత్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, అర్చకుడు వల్లూరి మహేశ్వర శర్మ, మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్, మహిళా సంఘాల సభ్యురాళ్లు ఉప్పుల జ్యోతి, సిరిసేటి పద్మ, తూడి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
జూలపల్లి, జూలై 24: మండల కేంద్రంలోని శ్రీ రాజయోగి ఆశ్రమంలో గురుపౌర్ణమి సందర్భంగా పలువురు ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, సర్పంచ్ దారబోయిన నరసింహం, ఆశ్రమ కార్యదర్శి కన్నం సత్యనారాయణ, నాయకులు అడ్వాల తిరుపతి, రాంగోపాల్ రెడ్డి తదితరులున్నారు.
ధర్మారం, జూలై 24: మండల కేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో యోగా గురూజీ సుధాకర్, మంజుల ఆధ్వర్యంలో వేడుకలను చేపట్టారు. ఈ సందర్భంగా అభ్యాసకులు అంతా కలిసి యజ్ఞం నిర్వహించారు. అనంతరం అభ్యాసకులు అంతా కలిసి గురూజీ సుధాకర్ను శాలువాలతో సన్మానించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ శిశు గృహ (బాల సదన్)లో రూ.5,116 విలువైన నిత్యావసరాలను గురూజీ సుధాకర్ అందజేశారు.
జ్యోతినగర్(రామగుండం), జూలై 24: రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. ఇక్క డ ఆలయ కమిటీ చైర్మన్ కన్నూరి సతీశ్కుమార్, అర్చకులు రాంపెల్లి శ్రీనివాస శర్మ, ఆలయ కమిటీ సభ్యులు సాంబయ్య, శివకుమార్, రమేశ్, శ్రీను, ఉదయ్, అక్షయ్, భాస్కర్, శ్రీను, రమేశ్, అశోక్కుమార్, భాగ్యలక్ష్మి, శ్రీలత, ఉషారాణి, ఉమాలక్ష్మి, ప్రియాంక, శ్రీవల్లిక, సరిత, శ్రీవాణి, ప్రవలిక, శ్రీదేవి ఉన్నారు.