దండేపల్లి, జూలై 9 : ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, దాతల సహకా రం, సర్పంచ్ కందుల కల్యాణి, ఉపసర్పంచ్ రెంక అనిల్, జీపీ కార్యదర్శి శ్రవణ్ సహకారంతో గ్రామ రూపురేఖలు మారిపోతున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలతో పల్లె పచ్చదనం, శుభ్రతతో కళకళలాడుతున్నది. పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతుండగా, ప్రతి వీధిలోని మట్టి రోడ్లు సీసీగా ఆహ్వానం పలుకుతున్నాయి. జీపీ నుంచి ప్రజలకు ఏదైనా సమాచారం క్షణాల్లో అందాలంటే ప్రధాన కూడళ్ల వద్ద మైకులు, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామం ముఖద్వారం వద్ద ఎల్లమ్మ తల్లి, పోచమ్మ ఆలయాలు, తెలంగాణ తల్లి, వివేకానందుడి విగ్రహాలు, రోడ్డుకు ఇరువైపులా నాటి ఏపుగా పెరిగిన మొక్కలు స్వాగత తోరణాల్లా ఆహ్వానం పలుకుతున్నాయి. ఇవే కాకుండా వైకుంఠధామం, కంపోస్టు షెడ్, డంప్ యార్డు నిర్మాణంతో గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. మిషన్ భగీరథ నీటితో తాగునీటి సమస్యకు చెక్ పెట్టినట్లయింది. ఊరికి సమీపంలో 5 వేల మొక్కలతో కమ్యూనిటీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు.
అభివృద్ధిలో ముందుకు..
రెబ్బెన్పెల్లి గ్రామ జనాభా 3,100 ఉంది. 800 నివాస గృహాలు, 10 వార్డులున్నాయి. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఆదర్శంగా నిలువడంతో పాటు పన్నులు చెల్లించడంలో ఒక అడుగు మందుకేసి ప్రతి యేడాది 90 శా తం పన్నులు వసూలు చేస్తున్నారు. గ్రామం లో 25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టా రు. భూలక్ష్మీవాడలో రూ.7లక్షలు, హైస్కూల్ దగ్గర రూ.7లక్షలు, ఎస్సీ కాలనీలో రూ.4 లక్షలు, బండవాడలో రూ.7లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ.4 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నారు. రూ.2.5 లక్షలతో డంప్ యార్డు నిర్మించారు. దాతల సహకారంతో రూ.లక్షతో ప్రధాన కూడళ్లలో 11 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సమాచారం కోసం 11 మైకులు ఏర్పాటు చేశారు. దాత సంగనబట్ల రాజేంద్రప్రసాద్, గ్రామస్తుల సహకారంతో గ్రామంలో తెలంగాణ తల్లి, వివేకానంద విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఊరికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని భద్రపరచడానికి ఫ్రీజర్ను దాతలు అందించారు. జీపీలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను ఏర్పాటు చేశారు. ఇటీవలే హైస్కూల్లో రూ.22లక్షలతో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. గతనెల 12న రెబ్బెన్పెల్లి గ్రామ ముఖ ద్వారం వద్ద రూ.1.08 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు భూమిపూజ చేశారు.
అన్ని హంగులతో వైకుంఠధామం, డంప్యార్డు..
గతంలో ఎవరైనా చనిపోతే గ్రామానికి దూరంగా దహన సంస్కారాలు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఊరికి చివర్లో గుట్ట పక్కన వైకుంఠధామం నిర్మించడంతో చివరి మజి లీకి కష్టాలు తప్పాయి. ప్రభుత్వం రూ.12.5 లక్షలతో అన్ని హంగులతో వైకుంఠధామాన్ని నిర్మించింది. స్నానాలు చేయడానికి గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దాతలు రూ.80 వేలతో బోరు వేయించి, మోటరు కనెక్షన్ ఇచ్చా రు. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్, ట్రాలీ తో సేకరించిన తడి, పొడి చెత్తను డంప్ యార్డులో నిల్వ చేస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది ఇంటిం టికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. ఇటీవల వర్మీ కంపోస్ట్ తయారీకి ఒక్కో కంపోస్ట్ షెడ్డుకు వాన పాముల బ్యాగులు 5 చొప్పున ఇచ్చారు. దీంతో జీపీ కార్యదర్శి సిబ్బందితో కలిసి వర్మీ కంపోస్ట్ తయారీ పనులకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల గ్రామానికి అదనపు ఆదాయం చేకూరనుంది.
స్వాగతం పలుకుతున్న పచ్చదనం..
రెబ్బన్పెల్లి ముఖద్వారం నుంచి రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నాయి. మొక్కల రక్షణకు జీపీ పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ట్రీగార్డులు అమర్చడంతో గ్రామానికి కొత్త రూపు తెచ్చిపెట్టాయి. గ్రామ సమీపంలో గుట్ట పక్కన నిర్మించిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరంగా మారింది. రకరకాల పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో చుట్టూ ఫెన్సింగ్, ప్రకృతి ప్రేమికుల కోసం వాకింగ్ ట్రాక్, సందర్శకులు సేదదీరేందుకు బెంచీలు, గేటు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చే నిధులే కాక జీపీ నుంచి రూ.2.30 లక్షలతో పార్క్ను అభివృద్ధి చేశారు. సుమారు 4వేల మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా ఒక వన సేవకుడిని నియమించారు. పల్లె ప్రకృతి వనానికి సమీపంలో కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 5 వేల మొక్కలు నాటారు. వీటికి జీపీ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు.
నేరుగా జీపీకే నిధులు..
గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం నేరుగా జీపీల ఖాతాల్లోనే నిధులు జమచేస్తున్నది. ప్రజ ల అవసరాలను గుర్తించి, జీపీ తీర్మానం తో ఇప్పటి వరకు గ్రామంలో రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. దాత సంగనబట్ల రాజేంద్రప్రసాద్, మరి కొందరి సహకారం మరువలేనిది. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్తో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటు న్నాం. ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు, ముఖ్య సమాచారం తెలుపడానికి మైకులు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిరోజూ ఉద యం ప్రజలతో ప్రధాన కూడళ్ల వద్ద సామూహిక జనగణమ ణకు ఏర్పాట్లు చేశాం. – కందుల కల్యాణి, సర్పంచ్, రెబ్బెన్పెల్లి
ఎమ్మెల్యే సహకారంతోనే..
ఎమ్మెల్యే దివాకర్రావు సహకా రంతోనే గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఊరు బాగుపడింది. గతంలో కంటే సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పని చేసినా ఫలితం కళ్లముందు కనబడుతున్నది. గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి..
గ్రామంలో సర్పంచ్, ఉపసర్పంచ్, దాతలు, గ్రామపెద్దల సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. పీపీవీలో నాటిన మొక్కల తో పాటు, కమ్యూనిటీ ప్లాంటేషన్లో నాటిన మొక్కలను రక్షించేందుకు వనసేవకుడిని నియమించాం. దాతలు వేయించిన బోర్తో ప్రతిరోజూ నీటిని అందిస్తున్నాం. స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి.