నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 8: జిల్లాలో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సహకార శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటారు.జక్రాన్పల్లి మండలం పడకల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను డీఆర్డీవో చందర్నాయక్ పరిశీలించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డీఆర్డీవో వెంట ఎంపీడీవో లక్ష్మణ్, పీఆర్ ఏఈ శ్రీధర్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ గంగారెడ్డి ఉన్నారు. ధర్పల్లి మండలంలోని 22 గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.పల్లెప్రగతి పండుగలా కొనసాగుతున్నదని కోటగిరి మండలం ఎత్తొండ సహకార సంఘం చైర్మన్ అశోక్పటేల్ అన్నారు. విండో ఆవరణలో సర్పంచ్ సాయిబాబాతోకలిసి ఆయన మొక్కలు నాటారు. హంగర్గాలో ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, సర్పంచ్ సునీత, విజయ్పటేల్ మొక్కలు నాటారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్పటేల్, కిశోర్చంద్ర, పంచాయతీ కార్యదర్శి కవిత, అంగన్వాడీ టీచర్లు శారద, స్వరూప , విండో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ విశ్వవిద్యాలయం ఆవరణలో వసతిగృహాల సంచాలకుడు డాక్టర్ ఎండీ జమీల్ అహ్మద్ ఆధ్వర్యంలో సిబ్బంది మొక్కలు నాటారు. గెస్ట్హౌజ్, క్యాంటీన్, లా బిల్డింగ్, హెల్త్సెంటర్, సెంట్రల్ లైబ్రెరీ వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పంచరెడ్డి చరణ్, పుప్పాల రవి, యెండల ప్రదీప్, సిబ్బంది అలీం, చౌహాన్, రమేశ్, క్రాంతి, గులాబ్, సుభాన్, అలీ తదితరులు పాల్గొన్నారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని విజిలెన్స్ ప్రత్యేకాధికారి నారాయణ సూచించారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామాన్ని ఆయన సందర్శించి నర్సరీ, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ నోముల విజయలక్ష్మి, కార్యదర్శి లావణ్య, ఏఈవో శ్రీహరి, కారోబార్ రాజన్న తదితరులు ఉన్నారు. మల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ సత్యనారాయణ ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఆయన వెంట ఉపసర్పంచ్ రఘునందన్, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు. మోపాల్ మండలం సిర్పూర్లో నిర్వహించిన పల్లెప్రగతిలో సర్పంచ్ ముత్యంరెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఐకేపీ, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలోని 34 గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. సుద్దులం గ్రామం లో రోడ్ల పక్కన పెరిగిన పిచ్చిమొక్కలను సర్పంచ్ వెంకటేశ్ ఆధ్వర్యంలో తొలగించారు. గుంతలను మొరంతో పూడ్చివేశారు. ఇందల్వాయి తహసీల్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ రమేశ్ వీఆర్ఏలు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. భీమ్గల్ మండలంలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కలు నాటే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ముచ్కూర్ సొసైటీ ఆవరణలో చైర్మన్ వెంకటేశ్ మొక్కలు నాటారు. బాచన్పల్లిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, మోర్తాడ్ మండలం దోన్పాల్లో సర్పంచ్ పర్సదేవన్న మొక్కలను పంపిణీ చేశారు. కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ పద్మ ప్రారంభించారు.బోధన్ మండలం సాలూరా పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు. భవానీపేట్లో నిర్వహించిన పల్లెప్రగతిలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ మాణిక్ వెంకట్రెడ్డి, సర్పంచ్ కృష్ణప్రసాద్, ఎంపీటీసీ హన్మంతు, సొసైటీ చైర్మన్ ముత్తారెడ్డి, గంగారెడ్డి పాల్గొన్నారు.
ఎడపల్లి సింగిల్విండో గోదాం ఆవరణలో అధ్యక్షుడు మల్కారెడ్డి, సర్పంచ్ మాధవి, ఎంపీటీసీ షేక్ జావిద్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. జాన్కంపేట్ సింగిల్విండో ఆవరణలో ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్తో కలిసి అధ్యక్షుడు నరేందర్, ఎంపీటీసీ సంజీవ్, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు సుంకరి రాజాగౌడ్, డైరెక్టర్లు మొక్కలు నాటారు. నవీపే మండల కేంద్రంలోనిసొసైటీ ఆవరణలో చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు మొక్కలు నాటారు. రాంపూర్, ఫత్తేనగర్, జన్నేపల్లి, నారాయణపూర్ తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి.ఏర్గట్ల సొసైటీ ఆవరణలో చైర్మన్ బర్మ చిన్ననర్సయ్య పాలకవర్గ సభ్యులు, ఎంపీపీ ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్తో కలిసి మొక్కలను నాటారు. సీఈవో శ్రీనివాస్, పాలక వర్గ సభ్యులు ప్రభాకర్, భూక్యా పెద్ద కిషన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ మండలం కిసాన్నగర్లో రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ దవాఖాన ఆవరణలో నాటిన మొక్కలకు ట్రీగార్డులను సర్పంచ్ మానేటి తులసీనాగభూషణ్ ఏర్పాటు చేయించారు. ఆర్మూర్ మండలం ఆలూర్ సొసైటీ ఆవరణలో చైర్మన్ కల్లెం భోజారెడ్డి, జిలా సహకార అధికారి సింహాచలం, ఆర్మూర్ ఏడీఏ హరికృష్ణ, సొసైటీ క్లస్టర్ ఆఫీసర్ సత్యనారాయణ, ఆర్మూర్ ఎంపీపీ నర్సయ్య, వైస్ ఎంపీపీ భోజకళ మొక్కలు నాటి నీళ్లు పోశారు. సర్పంచ్ భోజారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ మల్లేశ్, సొసైటీ సీఈవో మల్లేశ్, డైరెక్టర్లు పాల్గొన్నారు. మాక్లూర్ సొసైటీ ఆవరణలో చైర్మన్ గోపులక్ష్మి మొక్కలు నాటారు. వైస్ చైర్మన్ రమేశ్, డైరెక్టర్లు, సీఈవో విష్ణు పాల్గొన్నారు. మదన్పల్లిలో ఎంఈవో రాజగంగారెడ్డి మొక్కలు నాటారు. చందూర్ మండలం లక్ష్మాపూర్లో రోడ్ల పక్కన మొక్కలు నాటారు.