యాదగిరిగుట్ట రూరల్, జూలై 07: తెలంగాణ ప్రజల సం క్షేమమే ధ్యేయంగా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా మారాడ ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేంద ర్రెడ్డి అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కు లను బుధవారం యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం వద్ద అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపె ట్టడం గొప్ప విషయమన్నారు. గతలంలో ఏ ప్రభుత్వాలు పేద ల గురించి పట్టించుకోలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ అధికారం లోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి వాటిని అమలు చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. నేడు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరు తున్నాయని తెలిపారు. 28 మంది లబ్ధిదారులకు చెక్కులు అం దజేసినట్లు ప్రభుత్వవిప్ తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మా ర్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్, యాదగిరిగుట్ట మున్సి పల్ చైర్మన్ ఎరుకుల సుధ, తహసీల్దార్ ఆశోక్రెడ్డి, జడ్పీటీసీ అనురాధ, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామానికి చెందిన కే.బార్గవికి సీఎం సహాయనిధి నుంచి రూ. 15 వేల చెక్కు మం జూరు అయింది. ఈ సందర్భంగా ఈ చెక్కును బాధితురాలికి ప్రభుత్వవిప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట య్య, నాయకులు స్వామి, ఎల్లయ్య, బాలయ్య పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామ మాజీ సర్పంచ్ గవ్వ ల లక్ష్మయ్య ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి బుధవారం మృ తుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబా నికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తొటకూరి అనురాధ, సర్పంచ్ తొటకూరి బీరయ్య, గ్రామస్థులు ఉన్నారు.