బంజారాహిల్స్: ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి ఈశ్వరప్రసాద్ (87) మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. 1934 ఆగ స్టు 4న జన్మించిన ఆయన.. 1990-94 మధ్య ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 1996లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్డ్ అయ్యారు. పలు ట్రిబ్యునళ్లు, కమిషన్లకు చైర్మన్గా వ్యవహరించి విశేషసేవలు అందించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. జస్టిస్ ఈశ్వరప్రసాద్ మృతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం ప్రకటించారు.