సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో సీనియర్ నటి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె పేరు జెమినీ సరస్వతి.. వయసు 94 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వయోభారంతో ఇబ్బంది పడుతున్న ఈమె జూన్ 28 సాయంత్రం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని కారైకుడి నుంచి వచ్చిన జెమినీ సరస్వతి ఐదో తరగతి చదువుతున్న వయసులోనే నాట్యంపై ఆసక్తితో.. నటనపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. స్వతంత్య్రం రాకముందే ఈమె సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.
1940ల్లోనే చంద్రలేఖ సినిమాతో డ్యాన్సర్గా పరిచయమయ్యారు. ఈమె అసలు పేరు సరస్వతి. జెమినీ సంస్థ నిర్మించిన చంద్రలేఖ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేయడంతో జెమినీ సరస్వతిగా మారిపోయారు. అదే పేరుతో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. చంద్రలేఖ సినిమాలో డ్యాన్సర్ గా కనిపించిన ఈమె.. కాదల్ పడుత్తుమ్ పాడు చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. శివాజీ గణేషన్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో పలు చిత్రాల్లో నటించారు. ఆమె కెరీర్లో 400 చిత్రాలు, 1000 పైగా నాటకాల్లో ఆమె వివిధ పాత్రలతో అలరించారు.
చాలా సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న జెమినీ సరస్వతి.. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఇటీవల పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ జూన్ 28న ఆమె తుదిశ్వాస విడిచారు. జెమినీ సరస్వతికి దక్షిణామూర్తి, సెల్వరాజ్ ఇద్దరు కొడుకులు. సరస్వతి మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఆర్ఆర్ఆర్ పోస్టర్పై సైబరాబాద్ పోలీసుల సెటైర్
కత్రినాకైఫ్ రాఖీ కడతానంటే వద్దన్నారట..స్టోరీ చదవాల్సిందే
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
లిప్ కిస్ టాక్ తో తాప్సీ పబ్లిసిటీ