పారిస్: ఆర్చరీ ప్రపంచకప్లో భారత స్టార్ ప్లేయర్ అభిషేక్ వర్మ స్వర్ణ పతకంతో మెరిశాడు. ప్రపంచకప్ స్టేజ్-3లో భాగంగా జరిగిన పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో అభిషేక్..అమెరికాకు చెందిన క్రిస్ స్కాఫ్పై సంచలన విజయం సాధించాడు. ఆఖరి వరకు హోరాహోరీగా జరిగిన పోరులో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి అభిషేక్..క్రిస్ 148 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే విజేతను నిర్ణయించే క్రమంలో నిర్ణయాత్మ పోటీలో అభిషేక్ 10-9తో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.