బండ్లగూడ, జూన్ 22: మూసీ కబ్జాకు యత్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని మూసీ ప్రాజెక్టు డైరెక్టర్ మాలతి పేర్కొన్నారు. మంగళవారం మూసీ రివర్ఫ్రండ్ డైరెక్టర్ మాలతి, రాజేంద్రనగర్ తాసీల్దార్ చంద్రశేఖర్, ఆర్ఐ సారిక, మూసీరివర్ ఫ్రంట్ సిబ్బందితో కలిసి మూసీ పరీవాహక ప్రాంతాల్లో జరుగుతున్న కబ్జాలపై నరసింహ అనే వ్యక్తి ఇచ్చి న ఫిర్యాదు మేరకు వారు మూసీ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూసీలోకి మట్టి పోస్తూ చదును చేయడంతో పాటు కబ్జాలకు పాల్పడుతున్న విషయం నిజమే అన్నారు. వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామన్నారు. మట్టి పోసిన వారితోనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. మూసీని కబ్జా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.