నారాయణపేట టౌన్, జూన్ 21 : జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ వనజమ్మ అధ్యక్షతన 2వ (గ్రామీణ అభివృద్ధి), 4వ (విద్య వైద్య సేవలు) స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్వో శైలజకు సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ద వాఖానలో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలపై సూపరింటెండెంట్ మల్లికార్జున్ను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టాలని, జూలై చివరి నాటికి పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న శ్మశానవాటిక పనులు, అంగన్వాడీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు, గ్రామ పం చాయతీ భవనాలు, పశువైద్యశాల భవన నిర్మాణాలు, వైకుంఠధామాలు, రైతు కల్లా లు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలంలో 5 నుంచి 10 ఎకరాల స్థలం లో చిట్టడివిని తలపించేలా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం నర్వ జెడ్పీటీసీ జ్యోతి అధ్యక్షతన జరిగిన 5వ (మహిళా, శిశు సంక్షేమం) స్థా యీ సంఘంలో జెడ్పీ సీఈవో సిద్ధిరామ ప్ప మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలన్నారు. కొవిడ్ ను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీ సుకుంటూ అంగన్వాడీ కేంద్రాలను సూపర్వైజర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. మహి ళా సంఘాల పటిష్ఠతకు కృషి చేస్తూ, సం ఘాల సభ్యులకు జీవనోపాధులు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా సమావేశాల్లో మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, కో ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, డీఆర్డీవో గోపాల్నాయక్ పాల్గొన్నారు.