సంగారెడ్డి, జూన్ 20 : నిరుపేదలకు సేవ చేయడానికే సేవా సమితి ఏర్పాటు చేశామని, దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందించి ఆదరించడం సంతృప్తి కరమని అయ్యప్ప ఆపద్బాంధు సేవా సమితి అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని గొల్లగూడెంలో నివాసం ఉంటున్న నిరుపేద దివ్యాంగుడు సురేశ్కు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న అభాగ్యులను ఆదుకొని ఆదరించడమే సమితి కర్తవ్యమన్నారు. సరుకుల పంపిణీకి సహకరించిన ఆనంద్ స్వామి సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో సేవా సమితి ప్రధాన కార్యదర్శి సాహితీ రాము, ఉపాధ్యక్షుడు కొక్కొండ శ్రీశైలం, కోశాధికారి మాణిక్యరెడ్డి, సభ్యులు గుండపల్లి నరేశ్ కుమార్, కారం రాధాకృష్ణ, వెంకన్న, సంగన్న, దుర్గారెడ్డి పాల్గొన్నారు.