ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి

రామగిరి, జనవరి 16: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థుల కోసం సింగరేణి ఆర్జీ-3లో చేపడుతున్న ఉచిత శిక్షణను యువకులు సద్వినియోగం చేసుకోవాలని జీఎం సూర్యనారాయణ కోరారు. ఈ మేరకు సెంటినరీకాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో ఉచిత శిక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తులను జీఎం కార్యాలయంలో అందజేయాలని కోరారు.
గోదావరిఖని, జనవరి 16: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు ఈ నెల 19వ తేదీ నుంచి గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీఎం నారాయణ తెలిపారు. ఈ మేరకు స్థానిక జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం త్యాగరాజు, అధికారులు నవీన్, రమేశ్, ఆంజనేయులు, మదన్మోహన్, బెనర్జీ బెంజిమన్, కాశీ విశ్వేశ్వర్, విశ్వమేధి, సారంగపాణి, శ్రీనివాస్, ఆంజనేయప్రసాద్ తదితరులున్నారు.
తాజావార్తలు
- క్రేజీ అప్డేట్ ఇచ్చిన మహేష్ బావ
- బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ఆఫీసుకు వ్యాపారవేత్త
- మేకను బలిచ్చిన పోలీస్.. సస్పెండ్ చేసిన అధికారులు
- జీవితంపై విరక్తితో విద్యార్థి ఆత్మహత్య
- ఫోన్ లాక్పై మాజీ భార్యతో గొడవ.. 15 కత్తిపోట్లు
- మూడవ టీకాకు అనుమతి ఇవ్వనున్న అమెరికా
- పైన పటారం అనే సాంగ్తో అనసూయ రచ్చ
- కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్టే: విజయ్ రూపానీ
- ట్రైలర్తో ఆసక్తి రేపిన గాలి సంపత్ టీం
- 200 మంది ఖైదీలు పరారీ.. 25 మంది మృతి