అమరావతి, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి రామకృష్ణకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. రూ.50 వేల పూచీకత్తుపై ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. విచారణాధికారికి సహకరించాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేసు విషయంపై మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది.
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా సీఎం జగన్పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై రామకృష్ణను మదనపల్లెలో పోలీసులు అరెస్టు చేశారు. జడ్జి రామకృష్ణలో కరోనా లక్షణాలు కనిపించటంతో బి. కొత్తకోట నుంచి మదనపల్లె వెళ్లి పరీక్షలు చేయించుకోవటానికి వెళుతుండగా మార్గ మధ్యలోఅడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో బెయిల్ అప్లై చేసుకోగా రెండు నెలలకు పలు షరతులతో కూడిన బెయిల్మం జూరు చేసింది ఏపీ హైకోర్టు.