పాట్నా: బీహార్లో కొత్త ఆంక్షలను ప్రకటించారు. కోవిడ్ వల్ల లాక్డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. మరో వారం రోజుల పాటు కొత్త ఆంక్షలు అమలులో ఉంటాయి. జూన్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆంక్షలు వర్తిస్తాయని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు సాయంత్రం 5 గంటల వరకు తెరవనున్నారు. ఇక షాపులను సాయంత్రం 6 గంటల వరకు తెరుస్తారు. నైట్ కర్ఫ్యూను రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అమలు చేయనున్నారు.