పండగొచ్చినా.. పబ్బమొచ్చినా.. ఊరికెళ్లాలన్నా.. చేనుకెళ్లాలన్నా ఒకప్పుడు రైతన్నకు ఎడ్లబండి వెన్నుదున్నుగా ఉండేది. బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఎడ్లబండి దాదాపు కనుమరుగైంది. అక్కడక్కడ మారుమూల ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తున్నప్పటికీ వాహనాల రద్దీకి.. రోడ్లపైకి మాత్రం రావడం లేదు. ఇలాంటి క్రమంలో లాక్డౌన్ కారణంగా వాహనాల రద్దీ లేకపోవడంతో జూరాల డ్యాంపై నుంచి ఇలా ఓ రైతన్న ఎడ్లబండిపై వెళ్తూ కనిపించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి