ఇన్ఫ్లో 13,314 క్యూసెక్కులు
810 అడుగులకు చేరిన నీటి మట్టం
శ్రీశైలం, జూన్ 11 : కృష్ణానది పరివాహక ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద రాక మొదలైంది. శుక్రవారం సుంకేసుల నుంచి 4,412 క్యూసెక్కుల, జూరాల ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పత్తి ద్వారా 17,052 క్యూసెక్కులు విడుదల చేయగా.. (మొత్తం 21,464 క్యూసెక్కులు) సాయంత్రం ఆరు గంటల సమయానికి 13,314 క్యూసెక్కుల ఇన్ఫ్లో జలాశయానికి నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 810 అడుగులకు చేరగా.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34.2920 టీఎంసీలు నిల్వ ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
జూరాలకు వరద
ధరూరు, జూన్ 11 : ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగు వ నుంచి వరద కొనసాగుతున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి 14,300 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా నమోదైంది. 17,042 క్యూసెక్కులతో విద్యుదుత్పత్తి చేస్తుండగా.. భీ మా లిఫ్ట్-1కు 650 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్కు 750 క్యూసెక్కులు, కోయిల్సాగర్ లిఫ్ట్నకు 315 క్యూసెక్కులు, జూరాల కుడి కాలువ ద్వా రా 490, సమాంతర కాలువ ద్వారా 750 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 20,747 క్యూసెక్కులు ఔట్ఫ్లోగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలకుగానూ 9.214 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
తుంగభద్ర డ్యాంకు స్వల్పంగా..
అయిజ, జూన్ 11 : కర్ణాటకలోని తుంగభ ద్ర డ్యాంకు వరద స్వల్పంగా వచ్చి చేరుతున్న ది. డ్యాం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో డ్యాంకు ఇన్ఫ్లో నమోదవుతున్నది. శు క్రవారం ఇన్ఫ్లో 345 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 242 క్యూసెక్కులుగా డ్యాం సెక్షన్ అధికారి వి శ్వనాథ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ ట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1590. 09 అడుగులకు చేరగా.. 100.855 టీ ఎంసీల నీటి మట్టానికిగానూ ప్రస్తుతం 9.906 టీఎంసీలుగా నమోదైనట్లు పేర్కొన్నారు.