టీఆర్ఎస్తో రాష్ట్ర సమగ్రాభివృద్ధి

పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
పార్టీలో కాంగ్రెస్ నాయకుల చేరిక
పెద్దపల్లి, జనవరి 6 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తున్నదని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. సుల్తానాబాద్ పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీతారమేశ్, సూర శ్యామ్, తిప్పారపు దయాకర్, పసెడ్ల సంపత్, సాజిద్, నరేశ్, వెంకటస్వామి, అరుణ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- వావ్ పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. వీడియో
- జార్ఖండ్లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
- తాజ్మహల్కు బాంబు బెదిరింపు
- గుడ్ న్యూస్ చెప్పిన శ్రేయా ఘోషాల్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- డ్యాన్స్తో అదరగొట్టిన జాన్వీ కపూర్.. వీడియో వైరల్
- ల్యాండ్ అయినట్లే అయి పేలిపోయిన స్టార్షిప్.. వీడియో
- ఏడాదిగా కూతురుపై తండ్రి లైంగిక దాడి
- దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు
- ఆదిపురుష్ సెట్ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు..!