నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి ! రాష్ట్రంలో కురిసిన తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటపొలాలను దున్ని విత్తనాలు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. కొంతమంది ఇప్పటికే చెలకల్లో అచ్చు కొట్టి విత్తనాలు విత్తేందుకు సిద్ధమయ్యారు. మరి కొందరు నార్లు పోస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్లోని అలుగునూరు శివారులో వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వాటికి సంబంధించిన దృశ్యాలు మీకోసం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి