కుమ్రం భీం ఆసిఫాబాద్ : కరోనా బారిన పడి మృతి చెందిన మావోయిస్టు గడ్డం మధుకర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కొండపల్లిలో(ఆసిఫాబాద్ జిల్లా) సోమవారం ముగిశాయి. గ్రామస్తులు మధుకర్ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. మధుకర్ అంత్యక్రియల ఖర్చు నిమిత్తం సిర్పూర్ (టీ) ఎమ్మెల్యే కొనేరు కోనప్ప రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. మధుకర్ అంత్యక్రియల నేపథ్యంలో కొండపల్లి గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కరోనా బారినపడిన మధుకర్ చికిత్స కోసం ఈ నెల 2న వరంగల్కు వచ్చి అక్కడి పోలీసులకు చిక్కాడు. దీంతో ఆయనను పోలీసులు హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానలో చేర్చి చికిత్స అందించారు. ఈ క్రమంలో గుండెపోటుకు గురై మధుకర్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గడ్డం మధుకర్ 22 ఏళ్ల క్రితం పీపుల్స్వార్లో చేరారు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తున్నాడు.