న్యూఢిల్లీ: కంగారూ గడ్డపై సత్తాచాటి ఉత్సాహంలో ఉన్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇంగ్లండ్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధిక వికెట్లు పడగొట్టిన సిరాజ్.. ఆ టూర్ తన కెరీర్ను మార్చేసిందని వెల్లడించాడు. ‘ఆసీస్ పర్యటన నా కెరీర్కు ఎంతగానో ఉపయోగపడింది. నా బౌలింగ్ శైలిలోనూ మార్పులు చేసుకునేందుకు దోహదం చేసింది. ప్రస్తుత భారత జట్టులో సభ్యుడినైనందుకు గర్విస్తున్నా. కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు సూచనలిచ్చేందుకు మన జట్టులో సీనియర్లు సిద్ధంగా ఉంటారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో తెలియదు. ఒకవేళ చాన్స్ వస్తే తప్పక సత్తాచాటుతా’అని మంగళవారం సిరాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.