కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి: 2 కప్పులు, మామిడిపండు గుజ్జు: అర కప్పు, ఉప్పు: చిటికెడు, యాలకుల పొడి: చిటికెడు, చక్కెర: 3 టేబుల్ స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం:
ముందుగా మామిడిపండ్ల ముక్కలు, యాలకుల పొడి, చక్కెర కలిపి మిక్సీలో గుజ్జులా చేసుకోవాలి. ఒక గిన్నెలో మామిడి గుజ్జు, జల్లించిన గోధుమపిండి వేసి పూరీపిండిలా కలుపుకోవాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. తడిపిన పిండి తడిబట్టతో కప్పి పెట్టి, అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీలుగా వత్తుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, ఈ పూరీలను రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వేడివేడి మ్యాంగో పూరీలపై చక్కెర చల్లుకొని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.