రూ. 5లక్షల చెక్ కలెక్టర్కు అందజేసిన
ఎమ్మెల్యే శంకర్నాయక్
మహబూబాబాద్, మే 20 : ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ తన పుట్టినరోజు సందర్భంగా కరోనా బాధితులకు చేయూతనిచ్చారు. రూ. 5 లక్షల చెక్ను గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ వీపీ గౌతమ్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజాప్రతినిధులు, ఉన్నతవర్గాలకు చెందిన వారు కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేం దుకు ముందుకురావాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే నెల్లికుదురు మండలంలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉదయమే జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలక్షేమం కోసం రాత్రీపగలు తేడా లేకుండా రహదారులను శుభ్రం చేస్తున్న మున్సిపాలిటీ సిబ్బంది వందమందికి నూతన వస్ర్తాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్నాయక్, సీతామహాలక్ష్మి దంపతులు జిల్లా కేంద్రం శివారు రాంచంద్రాపురం సమీపంలోని వేల్పులసత్యంనగర్ కాలనీలో దైవకృప అనాథాశ్రమంలోని పిల్లలకు అన్నదానం చేశారు. అనాథలంతా కలిసి శంకర్నాయక్కు మొక్కను బహుమతిగా అందజేశారు.
శంకర్నాయక్కు కేసీఆర్ శుభాకాంక్షలు
ఎమ్మెల్యే శంకర్నాయక్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, ఎంపీ సంతోశ్కుమార్కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు రామ్మోహన్రెడ్డి, ఫరీద్, యాళ్ల మురళీధర్రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి ఎమ్మెల్యేను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.