ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
భువనగిరి టౌన్, మే 19 : లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు, యాచకులకు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి భోజనం అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బెలిదె కృష్ణ జ్ఞాపకార్థం పట్టణంలోని పేదలకు, యాచకులకు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికులకు ఆహార పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ను ఈనెల 30వ తేదీ వరకు పొడిగించిందన్నారు. ప్రజలు లాక్డౌన్కు సహకరించాలని కోరారు. లాక్డౌన్ సమయంలో దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆం జనేయులు, వైస్చైర్మన్ చింతల కిష్టయ్య, భువనగిరి పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు గోమారి సుధాకర్రెడ్డి, 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేశ్, నాయకులు పాల్గొన్నారు.
ధైర్యంగా ఉండాలి
భువనగిరి అర్బన్, మే 19 : కరోనా బాధితులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ధైర్యంగా ఉంటేనే నుంచి త్వరగా కోలుకోవచ్చునని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతీమహేశ్ సమకూర్చిన రూ.25వేలను బుధవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అనంతారంలోని బాధితులు ఫణిందర్కు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎలాంటి లక్షణాలున్నా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారు అధైర్య పడొద్దని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించి, ప్రభుత్వం అందజేస్తున్న కిట్ను వాడాలన్నారు. గ్రామాల్లో కరోనాను తగ్గించడానికి వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, సర్పంచ్ చిందం మల్లిఖార్జున్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోమారి సుధాకర్రెడ్డి, నాయకులు గాదె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.