కరోనా బారినపడిన కుటుంబానికి సేవలు
అభినందించిన ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ఘన్పూర్,మే 17: ఒకే ఇంట్లో తాత, మనువడితోపాటు ఆరుగురు కరోనా బారినపడి, వైద్యసిబ్బంది చొరవతో వైరస్ను జయించారు. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ఈ కథనానికి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య స్పందించారు. కరోనా బాధిత కుటుంబానికి సేవలందించిన వైద్యసిబ్బందిని అభినందించారు. వారిని శాలువాతో సన్మానించారు. వివారాల్లోకి వెళ్తే.. స్టేషన్ఘన్పూర్ మండలం అక్కపల్లిగూడెం గ్రామానికి చెందిన గొట్టం యాదగిరి (90) కుటుంబంలోని ఆరుగురు కరోనా బారిన పడ్డారు. వారిలో ఆరునెలల బాబు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడి వైద్యసిబ్బంది ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది. తాము సూచించిన విధంగా మందులు వాడుతూ, జాగ్రత్తలు పాటించాలని వారిలో భరోసా నింపింది. వారిచ్చిన ధైర్యంతో ఆ కుటుంబం కరోనాను జయించింది.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్య సోమవారం ఇప్పగూడెం పీహెచ్సీని సందర్శించి, యాదగిరి కుటుంబానికి సేవలందించిన వైద్యసిబ్బందిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యులు దేవుళ్లతో సమానమని, వ్యాధితో వచ్చిన వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రేమతో సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాంనర్సయ్య, తోట వెంకన్న, పీఏసీఎస్ డైరెక్టర్ యాకయ్య, కోమటిగూడెం సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ శైలజాఅజయ్రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ మహెబూబ్పాషా, డాక్టర్లు మౌనిక, రాము, పీహెచ్ఎన్ కృపామేరీ, హెచ్ఈవో వెంకటేశ్వర్లు, హెచ్వీ లక్ష్మి, ఏఎన్ఎంలు భాగ్యలక్ష్మి, భారతి, రాజ్యలక్ష్మి, వనజ, రేఖ, శోభ, రమ, సునీత పాల్గొన్నారు.