ముంబై: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా తీసుకున్నారు. ముంబైలో నిన్న వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆదివారం ఉదయం ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అమితాబ్ తన మొదటి డోసును ఏప్రిల్ 2న తీసుకున్నారు. ‘రెండో డోసు కూడా తీసుకున్నాను. నిన్న కుటుంబంతోపాటు, స్టాఫ్ అంతా పరీక్షలు చేయించుకున్నాం. అందరికీ నెగెటివ్ వచ్చింది. దీంతో అభిషేక్ మినహా కుంటుంబసభ్యులమంతా వ్యాక్సిన్ తీసుకున్నాం. అభిషేక్ ప్రస్తుతం లోకేషన్లో ఉన్నాడు. మరికొద్దిరోజుల్లో అతను తిరిగి రానున్నాడు. అప్పుడు అతడు కూడా వ్యాక్సిన్ తీసుకుంటాడు’ అని ఇన్స్టాలో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి