రాజా రాక్షసశ్చైవ
శార్దూలాః తత్ర మంత్రిణః
గృధ్రాశ్చ సేవకాస్సర్వే
యథా రాజా తథా ప్రజాః॥
రాజు మంచివాడైతే మంత్రులు, సేవకులు, ప్రజలు మంచిగా ఉంటారు. ఉండటానికి ప్రయత్నిస్తారు. లేకపోతే కనీసం నటిస్తారు. రాజు నీతివర్తనతో, సత్యవాక్కుతో పాలిస్తే.., ప్రజలు కూడా నీతితో వ్యవహరిస్తారు. లేకపోతే ఆ రాజ్యంలో అవినీతి అందలమెక్కుతుంది. ఆ రాజే రాక్షసుడైతే.. మంత్రు లు పెద్దపులుల్లా, సేవకులు గద్దల్లా వ్యవహరిస్తారని భావం. అందుకనే ‘రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు’ అన్న నుడికారం పుట్టింది.
టి.సుధాకరశర్మ